రైతుబంధు ద్వారా రానున్న రోజుల్లో ఏడాదికి రూ.10వేలు ఇస్తామని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. నంగనూరు మండలం మైసంపల్లిలో లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ.యువత వ్యవసాయంపై దృష్టి సారించి లాభసాటిగా వ్యవసాయం చేస్తున్నారని ప్రశంసించారు. సేంద్రీయ వ్యవసాయంతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. 45 ఏండ్ల నుంచి పెండింగ్లో ఉన్న వ్యవసాయ భూమి రికార్డులను ప్రక్షాళన చేసి రైతుల సమస్యలను పరిష్కరించామని తెలిపారు.
previous post