telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పుకార్లతో.. చిరాకుగా ఉన్నానంటున్న .. అజయ్ భూపతి

Ajay-Bhupathi

ఒక్కసారిగా ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో దర్శకుడు అజయ్ భూపతి క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమా సాధించిన విజయం .. రాబట్టిన వసూళ్లు ఇండస్ట్రీలో అంతా ఆయన వైపు చూసేలా చేశాయి. ఆయన తదుపరి సినిమాగా ‘మహా సముద్రం’ రూపొందనుందనీ .. ఇది యాక్షన్ తో కూడిన ప్రేమకథాంశమనే టాక్ వచ్చింది.

విశాఖ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని చెప్పుకున్నారు. తాజాగా ఈ విషయంపై దర్శకుడు అజయ్ భూపతి ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘ఎప్పుడు ఎవరితో ఎలాంటి సినిమా చేయాలో నాకు తెలుసు. దయచేసి పుకార్లకు చెక్ పెట్టండి’ అంటూ కోరాడు. ఈ సినిమాలో చైతూ కథానాయకుడిగా నటించనున్నాడనీ, కథానాయికగా సమంతను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వచ్చాయి. అసలు ప్రాజెక్టే లేదా? పైన పేర్కొన్న నటీనటులతో లేదా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది.

Related posts