“గురు” సినిమా విజయం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వెంకీ “ఎఫ్-2” సినిమాతో ఘన విజయం అందుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన “ఎఫ్-2” బ్లాక్బస్టర్ అయిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నాగచైతన్యతో కలిసి “వెంకీ మామ” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన ఓ రైస్ మిల్లు ఓనర్ గా కన్పించబోతున్నారని టాక్. అయితే తాజాగా వెంకీ ఇద్దరు యంగ్ డైరెక్టర్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. “పెళ్లి చూపులు” డైరెక్టర్ తరుణ్ భాస్కర్తో వెంకీ ఓ సినిమా చేయబోతున్నారట. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. అలాగే “సినిమా చూపిస్త మావ”, “నేను లోకల్” వంటి హిట్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథరావుతో కూడా వెంకీ సినిమా చేయబోతున్నారట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే సినిమాలపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే.
previous post
next post