telugu navyamedia
సినిమా వార్తలు

వాటర్ సప్లయర్ చేతిలో మోసపోయిన మహేష్ టీం ?

Sarileru-Neekevvaru

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు తన 26వ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు “సరిలేరు నీకెవ్వరు” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తోంది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక వాటర్ మాఫియా మోసంలో ఇరుక్కున్నట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది. మహేష్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ షూటింగ్ కాశ్మీర్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన వార్ సీన్స్ దర్శకుడు అనీల్ రావిపూడి అక్కడ భారీ స్థాయిలో తెరకెక్కించారు. ఇలాంటి నేపద్యంలో అత్యంత భారీ ఖర్చుతో ఈసినిమాను తీస్తున్న ఈ యూనిట్ ను కాశ్మీర్ లో ఒక వాటర్ సప్లయర్ మోసం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

సాధారణంగా సినిమాలకు సంబంధించిన షూటింగ్ స్పాట్ లో ఆహార పదార్ధాలను వాటర్ ను సప్లయ్ చేయడానికి ఆ ప్రాంతానికి చెందిన ఒక క్యాటరింగ్ కాంట్రాక్టర్ తో ఒప్పందం కుదుర్చుకుంటారు. అయితే ఈమూవీకి సంబంధించి క్యాటరింగ్ చేసిన ఆ కాంట్రాక్టర్ మినరల్ వాటర్ అని పేరు చెప్పి ఒక ప్రముఖ మినరల్ వాటర్ పేరుతో ఉన్న టిన్స్ లో వరసగా కొన్ని రోజులు పంపు నీళ్ళు సప్లయ్ చేసాడట. అయితే ఈ విషయం ఈయూనిట్ కు సంబంధించిన ఒక వ్యక్తి ద్వారా లీక్ అవ్వడంతో ఆ క్యాటరింగ్ కాంట్రాక్టర్ చేసిన మోసం బయటపడినట్లు తెలుస్తోంది. దీనితో షాక్ గురైన మహేష్ తాను గత కొద్ది రోజులుగా కల్తీ వాటర్ తాగానని తెలుసుకుని భయపడి పోవడమే కాకుండా ఆ షూటింగ్ స్పాట్ కు దగ్గరలో ఉన్న ఒక ప్రముఖ డాక్టర్ దగ్గరకు వెళ్లి చెక్ చేయించుకున్నాడు అంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Related posts