తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోన్న నేపథ్యంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ బతికించుకోవడానికే కార్మికులు సమ్మె చేస్తున్నారని అన్నారు. ఆర్టీసీకి ఎన్ని రోజులు సాయం చేయాలని ప్రభుత్వం అనడం సరికాదని విమర్శించారు.
ఆర్టీసీపై ఖర్చులను పెట్టుబడిగా చూడాలని, ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న డిమాండ్లలో విలీనం అనేది ఒక డిమాండ్ మాత్రమేనని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ డిమాండ్లపై చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరిస్తే ఆర్టీసీ సమ్మె ఉండదని కోదండరాం అన్నారు. పోలీసులు అన్నింటినీ శాంతి, భద్రతల కోణంలో చూస్తున్నారని విమర్శించారు.