ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల పిటిషన్లో సవరణలు చేసి ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర్రావు తిరిగి పిటిషన్ దాఖలు చేశాడు. ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించి విధుల్లోకి చేరతామన్నా తీసుకోవడం లేదని పిటిషనర్ న్యాయస్థానానికి తెలిపాడు. జీతాల్లేక కుటుంబాలను పోషించలేక ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నాడు. ఇక ఈ పిటిషన్పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి 50 రోజులు దాటింది. ప్రభుత్వం స్పందించకపోవడంతో కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి ఆర్టీసీ యాజమాన్యం నిరాకరించడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.