2019-20 సంవత్సరానికి కూడా ఆర్టీసీలో గ్రూపు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీం కొనసాగుతుందని ఆర్టీసీ అధికారి తెలిపారు. సంస్థ ఉద్యోగుల నుంచి ఏడాదికి ఒకసారి నిర్ణీత మొత్తం రికవరీ చేసి ప్రతి ఉద్యోగి పేరిట గ్రూపు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్లో బీమా చేస్తామని, 2016-17 సంవత్సరం నుంచి ఈ పథకం అమల్లో ఉందని, ఏటా దీనిని పొడిగిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ ఏడాది మార్చి 31వ తేదీతో గత ఏడాది బీమా కంపెనీతో చేసుకున్న ఒప్పందాల పరిమితి ముగిసినట్లు వివరించారు. ఈ ఏడాది తక్కువ ప్రీమియం కోట్ చేసిన మెసర్స్ గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుని ప్రతి ఉద్యోగికి రూ.247 ప్రీమియం చెల్లించి, ఒక్కొక్కరి పేరిట రూ.10 లక్షల ప్రమాద బీమా చేస్తామని వివరించారు. వివరాలకు పర్సనల్ ఆఫీసర్-1, హెడ్డాఫీస్, సెల్ఫోన్ నెంబరు 99592 25224లో సంప్రదించాలని ఆయన కోరారు.