telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఏపీలో రేపటి నుంచి రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు

apsrtc bus

లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్క నున్నాయి. డిపోల్లో ఉన్న బస్సులను శుభ్రం చేసే కార్యక్రమం కొనసాగుతోంది. గత 55 రోజులుగా డిపోలకే బస్సులు పరిమితం కావడంతో వాటి ఇంజిన్ కండిషన్ ను చెక్ చేస్తున్నారు. రేపటి నుంచి ఏపీలో బస్సులు తిరగనున్న నేపథ్యంలో ఆర్టీసీ కొన్ని నిబంధనలు విధించింది.ఈరోజు సాయంత్రం నుంచే రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయి.

రోజుకు 12 గంటల పాటు మాత్రమే బస్సులు తిరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు బస్సులు నడుస్తాయి. బస్సుల్లో టికెట్లు ఇవ్వడం అన్నది ఉండదు. డిపోల్లో బస్సు ఎక్కే ముందు టికెట్లను ఇచ్చే ప్రక్రియను అందుబాటులోకి తీసుకురానున్నారు. బస్సుల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు మాస్కులు ధరించి బస్సు ఎక్కాల్సి ఉంటుంది.

Related posts