telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

నల్గొండలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 22 మందికి గాయాలు..

rtc bus accident in nalgonda district

నల్గొండ జిల్లాలో ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదం జరిగింది. వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా కందుకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాత్రి ప్రయాణికులతో హైదరాబాద్‌ బయల్దేరింది.

బుగ్గబావిగూడెం సమీపంలోకి రాగానే వేగంతో వెళ్తున్న కంటైనర్‌ను తప్పించే క్రమంలో బోల్తాపడి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అంతా బురదమయంగా ఉండటంతో పలువురు ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు.

rtc bus accident in nalgonda districtaసమాచారం తెలుసుకున్న పోలీసులు డీఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

Related posts