కరెన్సీ నోట్ల రూపురేఖలు మార్చేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. తొలుత రూ. 100 నోట్లపై దృష్టి సారించింది. ఈ నోట్లపై వార్నిష్ పూత వేయనున్నట్టు తన వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ పూత పూయడం వల్ల ఈ నోట్లు మెరుస్తాయని తెలిపింది.
2019 నాటికి నగదు చలామణీ 17 శాతం పెరిగిందని ఆర్బీఐ వెల్లడించింది. కరెన్సీలో 51 శాతం వాటా రూ. 500 నోట్లదేనని చెప్పింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు మోసాలు 15 శాతం పెరిగాయని తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే అధిక మోసాలు జరిగాయని పేర్కొంది. త్వరలో మెరిసే నోట్లు అందుబాటులోకి రానున్నాయి.
కాంగ్రెస్ ఓటమి పాలైతే నాదే బాధ్యత: సీఎం అమరీందర్