దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి తాజా అప్డేట్ ఇచ్చారు. “ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ – అల్యూమినియం ఫ్యాక్టరీలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి” అని కీరవాణి ట్వీట్ చేశారు.
RRR updates- Music sittings are happening at Aluminium Factory.
— mmkeeravaani (@mmkeeravaani) March 9, 2019
ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ పూర్తి కాగానే టీమ్ మొత్తం బ్యూటిఫుల్ సిటీ కలకత్తాకు ప్రయాణం కానున్నట్లు తెలుస్తోంది. అక్కడ సుమారు 40 రోజుల పాటు ఆకర్షణీయమైన లొకేషన్లలో సినిమా చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ఈ షెడ్యూల్లో చరణ్, ఎన్టీఆర్ తో పాటు పలువురు కీలకపాత్రధారులకు సంబంధించిన షూటింగ్ జరగనుంది. తాజాగా ఈ సినిమాలో చరణ్, తారక్ ల పాత్ర గురించి ఓ వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ పోలీస్ అధికారి పాత్రలో రాముడి తరహాలో కనిపించబోతున్నాడట. ఎన్టీయార్ ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నెగెటివ్ షేడ్ తో రావణుడి తరహాలో నటిస్తున్నాడట. ఇక ఈ సినిమాలో కథానాయికలుగా బాలీవుడ్ హీరోయిన్లు ఆలియా భట్, పరిణీతి చోప్రాలను తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అలియా భట్ ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే హీరోయిన్ల విషయంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం 2020లో విడుదలవుతుందని ముందుగానే ప్రకటించారు.
రేప్ లకు సినిమాలు, సీరియల్స్ కూడా కారణం… బిగ్ బాస్ కౌశల్ మండా సంచలన వ్యాఖ్యలు