ప్రస్తుతం టాలీవుడ్లో రూపొందుతన్న ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ చిత్రం “ఆర్ఆర్ఆర్”. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అలియా భట్ కూడా ఇందులో నటిస్తున్నారు. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో, హై టెక్నికల్ వేల్యూస్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణను జరుపుకుంటుంది. సినిమా నిర్మాణం పూర్తి కాకముందే సినిమా బిజినెస్ మంచి క్రేజ్ ఏర్పడింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ పూర్తయ్యిందట. వివరాల ప్రకారం దుబాయ్కి చెందిన ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అన్నీ భాషలకు సంబంధించిన ఓవర్ సీస్ హక్కులను రూ.65 కోట్లకు చేజిక్కించుకున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. చైనా విడుదల హక్కుల మాత్రం ఆయనకు దక్కలేదట. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.
previous post
అది లేకపోతే..నగ్నంగా అనిపిస్తుందట!