ఐపీఎల్ 2021 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే లక్ష్యంతో దూసుకెళ్తుంది. వేలానికే ముందే ప్రణాళికలు రచించిన ఆ జట్టు తొలుత టీమ్ను బలోపేతం చేసుకుంది. ప్రస్తుతం ఆ జట్టు చాలా బ్యాలెన్సింగ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా మ్యాక్స్వెల్ టీమ్కు ట్రంప్ కార్డులా మారాడు. వరుసగా మూడు మ్యాచ్ల్లో రాణించి విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా ఫస్ట్ మూడు మ్యాచ్లు గెలవడం ఆర్సీబీకి ఇదే తొలిసారి. దాంతో ఆ టీమ్ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఎడిటింగ్ నైపుణ్యానికి పనిచెబుతూ స్పూఫ్ వీడియోలు రూపొందిస్తున్నారు.. తాజాగా బాలీవుడ్ బ్లాక్బస్టర్ ‘త్రీ ఇడియట్స్’ సినిమాలోని ఓ సీన్తో రూపొందించిన స్పూఫ్ వీడియో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్, అతని స్నేహితులిద్దరు వార్షిక పరీక్ష ఫలితాలను చూసే సీన్ను ఐపీఎల్ 2021 సీజన్ పాయింట్స్ టేబుల్కు ఆపాదిస్తూ ఎడిట్ చేశారు. యూనివర్సిటీ టాపర్గా నిలిచే ఆమిర్ ఖాన్ను ఆర్సీబీ టీమ్గా వర్ణించి.. అతని స్నేహితులను సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్లుగా పేర్కొన్నారు. ఇక ఆ సినిమాలోని కాలేజ్ ప్రిన్సిపాల్ను ముంబై ఇండియన్స్గా.. బట్టి పట్టి చదివే క్యారక్టర్ను చెన్నైగా అభివర్ణించారు. ప్రస్తుతం ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటుంది.
previous post
next post
ఈసీని నిందించడం సరికాదు.. చంద్రబాబుకు పురందేశ్వరి హితవు