telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్‌లో దారుణం.. నడిరోడ్డుపై ఓ వ్యక్తిపై కొడవలితో దాడి

crime

పోలీసులు నేరాలను అదుపు చేయడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..నేరాలను మాత్రం ఆపలేక పోతున్నారు. ఓ వైపు కార్డ్ అండ్ సర్చ్ ఆపరేషన్ ను చేపట్టి రౌడీ షీటర్ల కు స్థానికంగా వున్న ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నా రోజు ఏదోఒక రూపంలో నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజేంద్రనగర్ చౌరస్తా లో దాడి సంఘటన తీవ్ర కలకలం రేపింది. రాజేంద్రనగర్ చౌరస్తాలో బాల్ రాజ్ అనే రౌడీ షీటర్‌ రెచ్చి పోయాడు. రమేష్ అనే వ్యక్తి పై కొడవలితో దాడికి దిగాడు. విచక్షణారహితంగా రహితంగా దాడి చేయడంతో రమేష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. రమేష్ పై దాడి చేస్తుండగా చూసిన‌ ఇద్దరు వ్యక్తులు ధైర్యంగా బాల్ రాజ్ ను అడ్డుకున్నారు. వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దాడిని అడ్డుకోవడంతో రమేష్ కు పెను ప్రమాదం తప్పింది. దాడిని అడ్డుకోవడమే కాకుండా వెంటనే స్థానికంగా వున్న రాజేంద్రనగర్ పోలీసులకు, అంబులెన్స్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… నిందితుడు బాల్ రాజ్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రక్తపు మడుగులో పడి వున్న రమేష్ ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అతని‌ పరిస్థితి ఆందోళన కరంగా వుందని వైద్యులు అంటున్నారు. బాల్ రాజ్ కు, రమేష్ కు‌ మధ్య పశువులకు వేసే గడ్డి విషయంలో వివాదం చోటు చేసుకుందని సమాచారం అందుతోంది. కాగా నిందితుడు బాల్ రాజ్ పై రౌడీ షీట్ ఒపెన్ చేస్తామని, అలాగే పిడి యాక్ట్ కూడా నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Related posts