ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాజధాని అమరావతికి దగ్గరగా ఉండాలని నగరి ఎమ్మెల్యే రోజా విజయవాడలో ఇల్లు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆమె భర్త సెల్వమణితో కలిసి గృహప్రవేశం చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాజధానిగా దగ్గరగా రోజా దంపతులు ఇంటిని కొనుగోలు చేసినట్లు సన్నిహితవర్గాలు చెప్పాయి.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం రోజా ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో నగరిలోనే ఇంటిని నిర్మించుకున్నారు. తాజాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె నగరి నుంచి ఘనవిజయం సాధించారు.మరోవైపు నవరత్నాలను సమర్థవంతంగా అమలు అయ్యేలా చూసే బాధ్యతను సీఎం జగన్ రోజాకు అప్పగించే అవకాశముందని తెలుస్తోంది.