telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

క్యాబినెట్ లో చోటు దక్కని రోజా.. త్వరలో కీలక పదవి!

Roja Mla

చిత్తూర్ జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా మంత్రివర్గ రేసులో ఉన్నపటికీ సామాజిక న్యాయం లక్ష్యంగా సీఎం జగన్ రోజాకు మంత్రి పదవిని కేటాయించలేకపోయారు. క్యాబినెట్ లో స్థానం దక్కని రోజా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యేగా ఉన్న మహిళకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించవచ్చా? అన్న విషయమై ఆయన అడ్వొకేట్ జనరల్ సలహాను కోరినట్టు సమాచారం. మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్నవారు పార్టీలకు అతీతంగా ఉండాలి. ప్రస్తుతం ఈ పదవిలో నన్నపనేని రాజకుమారి కొనసాగుతున్నారు. ఆమె స్థానంలో రోజా నియామకానికి న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుంటే త్వరలోనే నియామకపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

Related posts