చిత్తూరులో సీఎం జగన్ ‘అమ్మ ఒడి’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నగరి ఎమ్మెల్యే రోజా టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.పేదల చదువును కార్పొరేట్ కార్పొరేట్ కళాశాలలకు బలిచేసిన చరిత్రహీనుడు చంద్రబాబు అని ఆమె వ్యాఖ్యానించారు. సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబుల మధ్య ఎంతో తేడా ఉందని అన్నారు.
పేద కుటుంబాల పిల్లల కోసం ‘అమ్మ ఒడి’ పథకాన్ని తీసుకువచ్చిన జగన్ చరిత్రకారుడని అభివర్ణించారు. గవర్నమెంట్ స్కూళ్లలో కనీసం తను చదివిన స్కూలును కూడా అభివృద్ధి చేయలేని అసమర్థ చరిత్రహీనుడు అంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు.
మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారంతో కూడిన మెనూను రూపొందించిన సీఎం జగన్ చరిత్రకారుడు అయితే, పేదలు తినాల్సిన కోడిగుడ్లను మింగిన చరిత్రహీనుడు చంద్రబాబు అని పేర్కొన్నారు.