టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సెటైర్లు వేశారు. అసెంబ్లీ సమావేశాల బ్రేక్ సమావేశంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మంగళగిరి అని పలకడానికి లోకేశ్ ట్యూషన్లు పెట్టించుకున్నారని అన్నారు. ‘లోకేశ్ ను చూస్తుంటే మంత్రుల కాళ్లు వణుకుతున్నాయంట.. నా కాళ్లు కూడా వణుకుతున్నాయి’ అని ఆమె ఎద్దేవా చేశారు.
అసెంబ్లీలో బాలకృష్ణకు మాట్లాడే అవకాశాన్ని చంద్రబాబు ఇవ్వడం లేదని… కళాకారులకు ఆయన అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా ప్రాజెక్టుల మీద కాకుండా రాయలసీమ ప్రాజెక్టులపై అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారని ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎద్దేవా చేస్తున్నారని అన్నారు.