telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

సెక్యూరిటీ సిబ్బందిపై గవాస్కర్ సీరియస్

Cricketer Sunil Gavaskar Comments Biopic

టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు క్రేజ్ ఎక్కువగా ఉండడంతో వారిని తాకేందుకు కొందరు వీరాభిమానులు స్టేడియంలో ప్రయాత్నాలు చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూణేలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో నిన్న రోహిత్ అభిమాని మైదానంలోకి చొచ్చుకొచ్చి… అతని కాళ్లపై పడ్డాడు. ఈ సందర్భంగా రోహిత్ కూడా పట్టుతప్పి కింద పడ్డాడు. జరిగిన ఘటనను అందరూ సరదాగే తీసుకున్నారు. కానీ, క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం సీరియస్ గా స్పందించారు.

స్టేడియంలోని సెక్యూరిటీ సిబ్బందిపై గవాస్కర్ మండిపడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది ప్రేక్షకులను గమనించడం మానేసి, మ్యాచ్ చూస్తున్నారని… అందుకే ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. మన దేశంలో సంవత్సరాల నుంచి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. మ్యాచ్ ను ఫ్రీగా చూడటానికి కాదు సెక్యూరిటీ ఉన్నదంటూ మండిపడ్డారు. ఇలాంటి ఘటనలను నివారించడానికే సెక్యూరిటీ ఉందనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

Related posts