ఐపీఎల్ తో ఒత్తిడికి గురైన ఆటగాళ్లు ప్రస్తుతం కాస్త విశ్రాంతి తీసుకుంటున్నాడు. మళ్ళీ ప్రపంచ కప్ కూడా త్వరలో ప్రారంభం కానుంది, దీనితో ఈ రెండిటి మధ్య ఉన్న చిన్న గ్యాప్ లో ఆటగాళ్లు కుటుంబాలతో కలిసి విహారయాత్రలలో బిజీగా ఉన్నారు. మే 30 నుంచి మళ్లీ ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఆటగాళ్లంతా ఇంగ్లాండ్కు పయనం కావాల్సి ఉంది. అయితే, ఈ రెండు టోర్నీలకు మధ్య కాస్త సమయం దొరికింది. ఆ సమయాన్ని రోహిత్ సరదాగా కుటుంబంతో గడుపుతున్నాడు. తన భార్య రితికా సజ్దే, కూతురు సమైరాతో పాటు కుటుంబసభ్యులతో కలిసి మాల్దీవుల్లో షికార్లు కొడుతున్నాడు.
ఆ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో తన అభిమానులతో పంచుకున్నాడు. ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రిమియర్ లీగ్లో ఛాంపియన్గా నిలిచిన ముంబయి జట్టుకు రోహిత్శర్మ కెప్టెన్గా వ్యవహరించాడు. ముంబయి ఖాతాలో నాలుగో టైటిల్ వేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఛాంపియన్ జట్టులో ఐదుసార్లు సభ్యుడిగా ఉన్నాడు. కెప్టెన్గా రోహిత్శర్మ.. ముంబయి ఇండియన్స్కు 104 మ్యాచుల్లో 60 విజయాలు కట్టబెట్టి 58.65 విజయాలు నమోదు చేశాడు. రానున్న ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టులో కీలకం కానున్నాడీ డబుల్ సెంచరీల స్పెషలిస్టు.