telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

రోడ్డు ప్రమాదంలో మూడు కార్లు ఢీ..ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

Road accident 8 dead and 30 injured

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చాగల్లు దగ్గర మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా వాహనాల్లో ఉన్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రహదారి విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో కొద్దిరోజులుగా ఒకే రహదారి మార్గంలో వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. అతివేగంతో పాటు వాహనాలు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Related posts