telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

కాలువలోకి దూసుకు వెళ్లిన కారు..ఇద్దరి దుర్మరణం

Accident

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. హిరమండలం వద్ద వున్న వంశధార రిజర్వాయర్ ను ఆనుకుని ప్రవహిస్తున్న కాలువలోకి అతివేగంగా వస్తున్న కారు అదుపుతప్పి కాలువలోకి బోల్తా కొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో ఒకరిది ఖమ్మం కాగా, మరొకరిది రాజమండ్రి అని గుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం విశాఖలోని కోరమాండల్ ఫెర్టిలైజర్స్ లో ఏరియా మేనేజర్లుగా పనిచేస్తున్న రాజమండ్రివాసి పవన్ (32), ఖమ్మంవాసి బిందేటి చంద్రమోహన్ (45)తోపాటు మరో ముగ్గురు ఉద్యోగులు ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడిలోని సెంచూరియన్ యూనివర్సిటీలో జరిగే సమావేశానికి హాజరయ్యారు. నిన్న రాత్రి తిరుగు ప్రయాణంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో పవన్, చంద్రమోహన్ లు కారులోనే చనిపోయారు.

Related posts