రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని రావిరాల వద్ద ఔటర్ రింగ్రోడ్డుపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్సును కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఏలూరు నుంచి రోగిని హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా కారు అదుపుతప్పి అంబులెన్స్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్సులోని ముగ్గురూ మృతిచెందారు. కారు డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.