telugu navyamedia
క్రైమ్ వార్తలు

విద్యార్ధుల ఆటోను ఢీకొన్న లారీ..ఇద్దరు మృతి, నలుగురి పరిస్థితి విషమం

*విద్యార్ధుల ఆటోను ఢీకొన్న లారీ
*ఇద్దరు మృతి, నలుగురి పరిస్థితి విషమం

హైద‌రాబాద్ మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా చర్లపల్లి జైలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్‌ ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్ట‌డంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు.

ఆరుగురు పాఠశాల విద్యార్థినులంతా ఈసీఐఎల్‌ నుంచి చర్లపల్లి వైపు ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లారీ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆటో డ్రైవర్‌ వినోద్​ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts