హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్నగర్ లో ఈ రోజు అతి వేగంగా వచ్చిన కారు రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను ఢీకొట్టడంతో వారికి తీవ్ర గాయాలైనాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వారిద్దరు జింకలబావి కాలనీకి చెందిన అక్కాచెల్లెళ్లుగా గుర్తించారు.
మహిళలను ఢీ కొట్టిన అనంతరం ఆ కారు పల్టీలు కొట్టి మెట్రో డివైడర్ను ఢీకొట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓజోన్ ఆసుపత్రికి తరలించారు. బాధితులు వెంకటమ్మ, సత్తమ్మలుగా పోలీసులు గుర్తించారు. ఆ కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.