telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

వికారాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఏడుగురు మృతి

వికారాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో, లారీ, బస్సు మూడు వాహనాలు ఢీ కొనడంతో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన ఇవాళ ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు బోల్తా పడిపోవడంతో ఇద్దరు మృతి చెందగా… ఏడుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోని తప్పించబోయి బస్సు బోల్తా కొట్టగా.. వెనకాల వస్తున్న లారీ…. బస్సు, ఆటోని ఢీ కొట్టింది. దీంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరగడంతో రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి వాహనాలు. అయితే.. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. బస్సులోని ప్రయాణికులు ఇద్దరు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. కాగా.. చనిపోయిన వారంతా మోమిన్ పేట్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు.

Related posts