telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

సౌదీలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ వాసులు మృతి

Road accident 8 dead and 30 injured

బ్త్రతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్ళిన తెలంగాణ యువకులను మృత్యువు వెంటాడింది. కన్నతల్లిని, ఉన్నవూరిని విడిచి ఎడారి దేశంలో ఉపాధి కోసం వెళ్ళి ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. సౌదీలో ఆరేబియా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మంచిర్యాల జిల్లా వాసులు మృతి చెందారు. ద్విచక్రవాహనంపై పనులకు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో జన్నారం మండలం రోటిగూడెంకు చెందిన ఉప్పు మల్లేశ్(40), దండేపల్లి మండలం గుడిరేవుకు చెందిన రాజు(24) మరణించారు. ఉపాది కోసం మూడేళ్ల క్రితం రాజు, మల్లేశ్ సౌదీకి వెళ్లారు. రాజు, మల్లేశ్ మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Related posts