కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా కోడుమూరు నుంచి కడపకు బయల్దేరగా మార్గ మధ్యలో ఓర్వకల్లు గ్రామం వద్ద వీరి వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జయింది.
ప్రమాదం గురించి తెలియగానే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల సహాయంతో పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.