విశాఖ జిల్లాలోని అరకు ఘాట్ రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అరకు ఘాట్ రోడ్డులో పర్యాటకుల బస్సు బోల్తా కొట్టింది. అనంతగిరి {మం} డముకులో ఐదో నెంబర్ మలుపు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. అలాగే 8 మంది చనిపోయినట్లు గుర్తించారు. మృతులంతా హైదరాబాద్కు చెందినవారిగా గుర్తించారు. అరకు ఘాట్ రోడ్లో లోయలోకి దూసుకెళ్లింది టూరిస్ట్ బస్సు. ఈ నేపథ్యంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. అయితే… ప్రమాదం గురించి సమాచారం అందగానే… సహాయక చర్యలు ముమ్మరం చేశారు 108 సిబ్బంది పోలీసులు. ఇంకా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
previous post