ఆంధ్ర ప్రదేశ్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం కృష్టా జిల్లాలోని జగ్గయ్యపేట మండలంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టగా ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ పుణ్య క్షేత్రానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారు ఖమ్మం జిల్లాలోని మధిరకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కాగా.. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక వృద్ధుడు ఉన్నారు. ఈ కారులో డ్రైవర్తో పాటు 9 మంది ప్రయాణిస్తుండగా… ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది
previous post
next post
రాహుల్, లోకేశ్ లా కేటీఆర్ అసమర్థుడు కాదు: మంత్రి ఎర్రబెల్లి