తెలంగాణ రాష్ట్రంలో పెళ్లివ్యాను బోల్తాపడటంతో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం సమ్మక్క నుంచి సంతోలి వెళుతుండగా ఖండాల ఘాట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో పెళ్లి కుమార్తె కూడా ఉండడం గమనార్హం. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
విపక్ష నేతలు గులాబీ గూటికి బారులు: జగదీష్ రెడ్డి