telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..తొమ్మిది మంది దుర్మరణం

Accident

మధ్యప్రదేశ్‌లోని రీవాలో గురువారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని, సహాయక చర్యలు చేపట్టారు. గాయపద్దవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోలీసులు. స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Related posts