ప్రయాణికులతో రద్దీగా ఉన్న బస్సు ఎక్స్ప్రెస్వేపై ఓ ట్రక్కుపైకి దూసుకుపోవడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడా వద్ద తెల్లవారు జామున 5 గంటల సమయంలో జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
previous post