telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

రోడ్డు ప్రమాదంలో  ఏడుగురి మృతి

Road accident 8 dead and 30 injured
చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో  గత అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బలరాంపూర్ జిల్లా శంకర్‌గఢ్‌లో చోటుచేసుకొంది. ఓ పెళ్లిలో పాల్గొనేందుకు దాదాపు 40 మంది వ్యాన్‌లో బుల్సీ నుంచి అమేరా  వెళ్తుండగా ధరగావ్ వద్ద అదుపు తప్పి  వ్యాను బోల్తాపడడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. 
ప్రమాదం జరిగిన అరగంట వరకు అంబులెన్స్ రాలేదని దీంతో తీవ్రంగా గాయపడిన మరికొందరు మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. మృతి చెందిన వారిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అంబికాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts