తెలంగాణ రాష్ట్రంలోని సూర్యపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఆటోను ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సూర్యపేట జిల్లాలోని కోదాడలోని ఖమ్మం క్రాస్రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తమ్మరలో శ్రీరామనవమి వేడుకలకు వెళ్లివస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
previous post
కోమటిరెడ్డి అందుకే పార్టీ మారుతున్నారు.. ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు