telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురి దుర్మరణం

Accident

ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఈ మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టిన సంఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది.

గాయపడిన చిన్నారిని కావలి పట్టణంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా భావిస్తున్నారు. వీరు తెలంగాణలోని కరీంనగర్ మంకమ్మతోట ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. కారులో కరీంనగర్ నుంచి తిరుపతి వెళుతుండగా మోచర్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

Related posts