telugu navyamedia
ఆంధ్ర వార్తలు

శ్రీవారి సేవ‌లో ముఖేశ్ అంబానీ ..టీటీడీకి కోటి 50 లక్ష‌లు విరాళం

*తిరుమల శ్రీవారిని దర్శించుకొని ముఖేశ్ అంబానీ
*శ్రీవారికి రూ. 1.5 కోట్లు విరాళం ప్రకటించిన ముఖేష్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయ‌న చిన్నకొడుకు అనంత్ అంబానీ, కాబోయే కోడలు రాధిక తోకలిసి వచ్చిన ఆయన స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు. ఆ తర్వాత అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను ముఖేష్ అంబానీకి అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీవారికి రూ. 1.5 కోట్లు విరాళాన్ని డీడీ రూపంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులు ప్రతిఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు.అంతకుముందు ఆలయానికి చేరుకున్న ముఖేశ్‌ అంబానీకి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.

Related posts