telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దేశం తెలంగాణను చూసి గర్వపడుతుంది: మంత్రి ఈటల

Etala Rajender

దేశం తెలంగాణను చూసి గర్వపడుతుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. జగిత్యాల జిల్లా పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన విజయానికి విద్యుత్‌ రంగమే ఓ ఉదాహారణ అన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ఫలితాలు మనం అనుభవిస్తున్నామన్నారు. ఆరోగ్య తెలంగాణ అయితేనే బంగారు తెలంగాణ అవుతుందని మంత్రి పేర్కొన్నారు.పట్టణాలను అభివృద్ధి దిశగా తీర్చిదిద్దాలని తెలంగాణ పల్లెలు, పట్టణాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.

తెలంగాణ ఏర్పడితే కుక్కలు చింపిన విస్తరి అవుతుందన్నారు. కానీ నేడు దేశ చిత్రపటం మీద మనం సమున్నతంగా నిల్చున్నామన్నారు. మనకు పరిపాలన రాదు అన్నారు. కానీ మన సీఎం కేసీఆర్‌ పరిపాలన అంటే ఎంటో చూపించి తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే సంజయ్‌, కలెక్టర్‌, మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, అదికారులు పాల్గొన్నారు.

Related posts