telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన .. రేవంత్ రెడ్డి

Revanth Reddy challenge on Kondangal election

ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి జగద్గిరిగుట్ట డివిజన్‌లో ప్రజలతో మమేకం అయ్యారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు జగద్గిరిగుట్టలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ తోరణాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ తోరణాలను తొలిగిస్తున్న శానిటేషన్ సూపర్‌వైజర్ వీరారెడ్డితో స్థానిక నేతలు గొడవకు దిగారు.

ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం అని తేల్చి చెప్పడంతో వెనక్కి తగ్గారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ పీఏ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ శానిటేషన్ సిబ్బంది అధికారుల ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన తోరణాలను పూర్తిగా తొలిగించారు.

Related posts