telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పోతిరెడ్డిపాడు’పై కేసీఆర్, జగన్ కలిసే నాటకం: రేవంత్ రెడ్డి

Revanth-Reddy mp

పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. ‘పోతిరెడ్డిపాడు’పై కేసీఆర్, జగన్ లు కలిసే నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ‘పోతిరెడ్డిపాడు’ విస్తరణ పనులను కాంగ్రెస్ పార్టీ తరఫున అడ్డుకుంటామని హెచ్చరించారు.

గతంలో కాంచీపురం సందర్శనకు సీఎం కేసీఆర్ సహా ఆయన కుటుంబం వెళ్లినప్పుడు వైసీపీ నేత రోజా ఇంటికి వారు వెళ్లిన విషయాన్ని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ కు సంబంధించిన హామీని అప్పుడే జగన్ కు, ఆ పార్టీ నేతలకు కేసీఆర్ ఇచ్చారని ఆరోపించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రుల హోదాలో కేసీఆర్, జగన్ లు రెండు సార్లు సమావేశమయ్యారని గుర్తుచేశారు.

Related posts