తెలంగాణ సచివాలయం, అసెంబ్లీ కూల్చివేత అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తుల రక్షణ బాధ్యత గవర్నర్ దేనని అన్నారు. ఈ విషయమై గవర్నర్ స్పందించకపోతే రాజ్ భవన్ ని ముట్టడిద్దామని, గవర్నర్ ను కూడా బాధ్యుడ్ని చేసి కోర్టులో పిటిషన్ వేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ తన మూఢ విశ్వాసాలను ప్రజలపై రుద్దుతున్నారని రేవంత్ విమర్శించారు. సచివాలయంలోని పోచమ్మగుడి, మసీదును ఎలా కూలుస్తారు? అని ప్రశ్నించారు. ఈ నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోలేమని కోర్టులు చెప్పడమంటే బాధ్యతల నుంచి అవి తప్పుకోవడమేనని విమర్శించారు.
చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్కు పడుతుంది : నారాయణ