telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గుజరాత్ చంచాలు అదానీ, అంబానీల కోసమే రైతు చట్టాలు : రేవంత్ రెడ్డి

revanthreddy campaign in huzurnagar

కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలపై రేవంత్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. నరేంద్రమోదీ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా రాజీవ్ రైతు భరోసా యాత్ర చేస్తున్నామని, మంద బలం ఉందని ఆదని,అంబానీలకు నరేంద్ర మోదీ దేశాన్ని కట్టబెట్టారని అన్నారు. నరేంద్ర మోడీ, అమీషా కలిసి దేశంలోని 80 కోట్ల రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోడీ మూడు నల్ల చట్టాల వల్ల అమలు చేస్తే ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ యార్డు, సిసిఐ కేంద్రాలు ఉండవు, గిట్టుబాటు ధరలుఉండవు. నల్ల చట్టాల ద్వారా కార్పొరేట్ వ్యవస్థల దగ్గర రైతులు బందీగా మారిపోతారని చెప్పారు. అంతేకాకుండా ఈ మూడు చట్టాల ద్వారా రైతులకు రక్షణ లేదని అన్నారు. ఈ నల్ల చట్టాలు రైతులను గుజరాత్ చంచాలు అదానీ, అంబానీలకు బందీలుగా మార్చే ప్రయత్నంగా రేవంత్ రెడ్డి అన్నారు. రైతులు తమకు న్యాయం జరగాలని ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు 82 రోజుల నుండి లక్షలాది మంది రైతులు ఆందోళన చేస్తున్నారు. నరేంద్ర మోదీ వారిని గుర్రాలతో తొక్కించారు. ఈ ఆందోళనలో ఇప్పటి వరకు 192 మంది రైతులు మరణించారు. అంతేకాకుండా జనవరీ 26న రైతులు చేసిన ట్రాక్టర్ ర్యాలీల సమయంలో రైతులను దేశద్రోహులుగా చిత్రీకరించారని అన్నారు.

Related posts