telugu navyamedia
రాజకీయ వార్తలు

రిపబ్లిక్ టీవీ చానల్ ఎడిటర్ ఆర్నాబ్ పై రేవంత్ ధ్వజం

Revanth-Reddy mp

రిపబ్లిక్ టీవీ చానల్ ఎడిటర్ ఆర్నాబ్ గోస్వామిపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గౌరవమర్యాదలకు భంగం కలిగేలా వ్యవహరించారంటూ ఆయన ఆరోపించారు. సోనియా పరువుప్రతిష్ఠలకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసిన ఆర్నాబ్ గోస్వామిపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

రిపబ్లిక్ టీవీ చానల్లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో సోనియాపై ఆర్నాబ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అన్నారు. సోనియా గాంధీ రాయ్ బరేలీ ఎంపీ మాత్రమే కాదు, పార్లమెంటరీ పార్టీ నేత, దేశ స్వాతంత్యం కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షురాలన్నారు.ఆర్నాబ్ గోస్వామి కుహనా పాత్రికేయంతో మత విద్వేషాన్ని వెళ్లగక్కాడన్నది అతను చేసిన దూషణల ద్వారా అర్థమవుతోందని లేఖలో పేర్కొన్నారు.

Related posts