telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

లోక్ సభ బరిలో రేవంత్.. మల్కాజ్ గిరి నుండేనట..!!

Congress Revanth Comments TRS

ముందస్తు ఎన్నికలతో ఒక అడుగు ముందున్న తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలలో కనిపించకుండా పోయిందా అన్నంత ఘోరంగా ఓటమిపాలైన కాంగ్రెస్ కనీసం లోక్ సభ ఎన్నికలలో అయినా గెలవాలని వ్యూహరచన చేస్తుంది. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డిని బరిలోకి దించాలని యోచిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఘోరపరాజయం పాలైన ఆయన మళ్ళీ అధిష్టానం ఆదేశిస్తే బరిలోకి దిగటానికి సిద్దంగానే ఉన్నానంటూ చెప్పడంతో, మల్కాజ్ గిరి నుండి పోటీకి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ సూచించినట్టు సమాచారం.

దీనిపై రేవంత్ మాట్లాడుతూ, తనకు అధిష్టానం ఎక్కడ నుండి పోటీకి దిగమంటే అక్కడ నుండి బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. ములుగు సీతక్క ను మహబూబ్ నగర్ నుండి కాంగ్రెస్ బరిలోకి దించనుందట. అభ్యర్థులపై మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ ఇంకా తొలిజాబితా కూడా విడుదల చేయలేకపోయింది. 15వ తేదీన పూర్తీ జాబితా విడుదల చేస్తామంటూ చెప్పుకుంటుంది.

Related posts