telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పార్టీ ఫిరాయింపులు కేసీఆర్ కు ‘కిక్’ ఇస్తున్నాయి: రేవంత్ రెడ్డి

Congress Revanth Comments TRS

పార్టీ ఫిరాయింపులు కేసీఆర్ కు ‘కిక్’ ఇస్తున్నాయని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎంపీలతో తెలంగాణ అభివృద్ధి ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. తమ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా సీపీఐను టీ-కాంగ్రెస్ కోరింది. పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐ మద్దతుతో కేసీఆర్ అరాచకంపై పోరాడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తో ఈరోజు రేవంత్ భేటీ అయ్యారు.

అనంతరం మీడియాతో రేవంత్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ని ఓడించేందుకు సీపీఐ సహకారం అవసరమని అన్నారు. మోదీని అడ్డుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని రేవంత్ ఆకాంక్షించారు. అరాచకానికి కేసీఆర్, మోదీ బొమ్మా బొరుసు లాంటివారని విమర్శించారు. కేసీఆర్ కేంద్రం నుంచి నయాపైసా రాలేదంటున్నారని పేర్కొన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి టీఆర్ఎస్ ఎందుకు మద్దతిచ్చింది? అని ప్రశ్నించారు. అక్కడ మోదీని, ఇక్కడ కేడీని నిలువరించాలంటూ కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు.

Related posts