telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

విశ్రాంత ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం

school teachers class

తెలంగాణలోని గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థల్లో పనిచేసే అధ్యాపకుల పనితీరును అంచనా వేసేందుకు విద్యాశాఖలో పని చేసి రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రిన్సిపాళ్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకులం ఆర్‌సీవో కొత్తూరి లక్ష్మయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

2019-20 విద్యా ప్రమాణాలను గుర్తించి బలోపేతం చేసేందుకు రిటైర్డ్ అయిన కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయ ఉద్యోగులు, రాష్ట్ర విద్యాశాఖలో పనిచేసిన వారు ఆయా సబ్జెక్ట్‌ల వారీగా రీజినల్ కోఆర్డినేటర్ కార్యాలయంలో ఈనెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నియమితులైన వారికి తగిన పారితోషికం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఏఆర్‌సీవో 9441094493 ద్వారా తమను సంప్రదించాలని తెలిపారు.

Related posts