telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో  రెండు చోట్ల రీ పోలింగ్‌కు ప్రతిపాదనలు: ద్వివేది 

After 11 Parishat Elections Telangana
ఏపీలోని  రెండు పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు పంపించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 244 నంబరు పోలింగ్‌ కేంద్రం, నరసరావుపేట నియోజకవర్గంలోని 94వ నంబరు పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలని గుంటూరు జిల్లా కలెక్టరు నుంచి ప్రతిపాదనలు అందాయన్నారు. వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామన్నారు. ఈసీఐ ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరి సేవలు ప్రశంసనీయమని ద్వివేది అన్నారు. ప్రశాంతంగా నిర్వహించటంలో కీలక పాత్ర పోషించారని అభినందించారు. 

Related posts