ఆంధ్రప్రదేశ్ లోని చంద్రగిరి నియోజకర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు రీపోలింగ్గ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదంతో మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
రీపోలింగ్ సందర్భంగా పులివర్తిపల్లిలోని పోలింగ్ కేంద్రానికి టీడీపీ చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని చేరుకున్నారు. అనంతరం వైసీపీ పోలింగ్ ఏజెంట్ తో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేయిదాటడంతో వైసీపీ ఏజెంట్ పోలింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పులివర్తి నానిని అదుపులోకి తీసుకొని ఆయనపై కేసు నమోదుచేశారు.
మండలిలో ఉన్నవారంతా చంద్రబాబు భజనపరులే: రోజా