కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఈసీ, ఏపీలో 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని సిఫారసు చేసింది. గుంటూరులో 2, నెల్లూరులో 2, ప్రకాశంలో ఒక చోట రీపోలింగ్ నిర్వహించాలని సిఫారసు చేసింది. ఈరోజు రాత్రికి రీపోలింగ్ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనున్నట్టు సమాచారం.
వీవీ ప్యాట్ స్లిప్పులు, ఈవీఎంల తరలింపుపై చర్యలకు అధికారులు సిద్ధమైనట్టు సమాచారం. హింసాత్మక ఘటనలు, సాంకేతిక కారణాల వల్ల ఆయా కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ సిఫారసు చేసింది.
బిగ్బాస్పై గీతామాధురి కామెంట్స్ …