telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

రైలు బోగీలకు విద్యుత్ సరఫరా.. ప్రయాణీకులకు గాయాలు

Attack Railway TTI in Danapur express

గుంటూరు జిల్లాలో రైలు బోగీలకు విద్యుత్ ఆవరించడంతో పలువురు ప్రయాణీకులకు తీవ్ర గాయాలైనాయి. వివరాల్లోకి వెళితే వేజెండ్ల రైల్వే స్టేషన్‌లో రేపల్లె ప్యాసింజర్ శనివారం షార్ట్ సర్క్యూట్‌కు గురైంది. బోగీలకు విద్యుత్ ప్రవహించడంతో రైలు దిగుతున్న ప్రయాణీకులకు కరెంట్ షాక్ తగిలింది. ఒక్కసారిగా జరిగిన ఘటనతో ప్రయాణీకులు ఫ్లాట్ ఫాం పైకి దూకేశారు.

ఈ గందరగోళంలో పలువురు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది.. గాయపడ్డ ప్రయాణీకులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుంటూరు నుంచి తెనాలి మీదుగా ఒంగోలు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని రైల్వే అధికారులు తెలిపారు.

Related posts